(SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్...
(SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యం లో జరుగుతున్నా అమరావతి కప్ 2.0 ఛాంపియన్షిప్ కు చిత్తూరు జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో మహేష్ మార్టియల్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రతిభకనబరిచారు. చిత్తూర్ లోని చిత్తూర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ (DSA)ఆధ్వర్యం లో జరిగిన ఈ పోటీలలో
అండర్ -17 విభాగం లో
1)పి.మొహమ్మద్ రిఫాన్ ఖాన్ (48-50 కిలో)క్యాటగరీ
2)ఎం.జ్ఞాన చరిత్ (60-63 కిలో) క్యాటగరీ
Under-21 విభాగం లో
వి.రాఘవేంద్ర (60-65 కిలో)
అను విద్యార్థులు చిత్తూరు జిల్లాస్థాయి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ఐనాటు చిత్తూరు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ (DSDO) ఉదయ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో చిత్తూర్ జిల్లా బాక్సింగ్ కోచ్ సురేంద్ర,పుంగనూరు కన్స్టిట్యూన్సీ పిడి ఇంచార్జ్ భాస్కర్ మరియు
మహేష్ మార్టియల్ ఆర్ట్స్ హెడ్ కోచ్ ఎం. రెడ్డి మహేష్ పాల్గొన్నారు . ఎంపిక ఐనా విద్యార్థులు ఈ నెలలో విజయవాడ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు అని తెలిపారు.