ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ
ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ
అనంతపురం జిల్లా: అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. సురేష్ అనే యువకుడిపై సునీత అనే మహిళ దాడి చేసి అతని మర్మాంగాన్ని కోసినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం, డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్న సునీతతో సురేష్కు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సురేష్ సునీత కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆగ్రహానికి గురైన సునీత ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
సురేష్ చేతులు, కాళ్లు కట్టేసి అనంతరం ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సురేష్ను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేష్ కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో పాటు దాడి జరిగిన పరిస్థితులపై కూడా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.