www.ntodaynews.com
ప్రజా భవన్లో వైభవంగా నల్లపోచమ్మ బోనాల వేడుకలు
తెలంగాణ
హైదరాబాద్లోని ప్రజా భవన్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నల్లపోచమ్మ బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వారి కుటుంబ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.