www.ntodaynews.com
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఆదేశం
మంచిర్యాల: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన స్వయంగా అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో కృషి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన తేజ్ ప్రకాష్ అగర్వాల్ తన పట్టా పాస్ పుస్తకంలో సవరణ చేయాలని కోరుతూ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ఆయా దరఖాస్తులపై స్పందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు