ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా
విస్సన్నపేట, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ జీ. లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల పెరుగుదల, సేంద్రియ ఎరువుల వినియోగం, జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ వ్యవసాయ విధానాలపై రైతులు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశాలపై కలెక్టర్ వివరాలు సేకరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా చేపట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.