ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...
ప్రసన్నయ్యగారి పల్లి రైతులకు పాసు పుస్తకాల పంపిణీ...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
ప్రసన్నయ్యగారి పల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు భూ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులకు పాసు పుస్తకాలను అందజేసి, వాటి ప్రాముఖ్యతను వివరించారు.
అధికారులు మాట్లాడుతూ, భూమికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదై ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులు తమ పాసు పుస్తకాలలోని వివరాలను పరిశీలించి, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,MRO రాము.మోపురి మోహన్ రెడ్డి. ఆనంద్. రమణ. సంజీవ. రెడ్డప్ప కృష్ణప్ప vro. వేణు Vro. మోహన్ రెడ్డి సర్వేరు. రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.