ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల డీపీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులతో పాటు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
మండలంలో సూరంపాలెం హ్యాబిటేషన్లో పనిచేస్తున్న డీపీఆర్టీయూ సభ్యుడు జి.డి.వి. విజయకుమార్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ బహుమతులను విద్యార్థులకు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.2016, ద్వితీయ స్థానం వారికి రూ.1516, తృతీయ స్థానం వారికి రూ.1016 నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి పి.ఎస్. సుధాకర్, ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈఓ–2 వీఎస్వీ బ్రహ్మచారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు లు యజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, డీపీఆర్టీయూ చాట్రాయి మండల అధ్యక్షుడు బి.సి.హెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి. రామారావు, జిల్లా నాయకులు సత్తెనపల్లి రాము, వెదుళ్ల వెంకటేశ్వరరావు, దారావత్తు నాగేశ్వరావు, చిన్నం శ్రీనివాస్, బాణావతు శ్రీను, జక్కం రాజేష్, అల్లాడ కృష్ణ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.