పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు
పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని పురాతన అంకమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టకు 16 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఘనంగా పండుగ సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
చెన్నారాయుడు సేవలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సన్నాయి, వీరంగాలు, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్వాహకుడు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజి మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు అందరూ సహకరించారని అన్నారు. భక్తులందరూ ఐక్యంగా పాల్గొని పండుగను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.