BREAKING
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం పుంగనూరు టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం మన శరీరం ఎంత ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన మియాజాకి మామిడిపండును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు బహుకరించిన రైతు ఘనంగా రాజా రామ్మోహన్ రాయ్ జయంతి వేడుకలు ఎండలో ఉపాధి కూలీలకు చల్లని ఊరట.. పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం.. లాటరీ పేరుతో ప్రజల జేబుకి చిల్లులు..కుటుంబాలు చిన్న భిన్నం దళితవాడలకు మౌలిక వసతులు కల్పించాలి: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
www.ntodaynews.com

పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 06:05 PM
39 వీక్షణలు

పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని పురాతన అంకమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టకు 16 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఘనంగా పండుగ సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

చెన్నారాయుడు సేవలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సన్నాయి, వీరంగాలు, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజి మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు అందరూ సహకరించారని అన్నారు. భక్తులందరూ ఐక్యంగా పాల్గొని పండుగను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.