పర్వతాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పర్వతాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనా కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా గ్రామంలోని నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బొర్రా నాగమల్లేశ్వరి, మిద్దే శివాజీ, బూబత్తుల చెన్నారావు, మిద్దె సత్యనారాయణ, బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, మేకపోతుల వెంకటేశ్వరరావు, బయగాని మల్లికార్జున్ రావు, కల్లేపల్లి ప్రభాకర్, చీపు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి ఆశయాలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావాలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.