BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

పర్వతాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 11:28 AM
264 వీక్షణలు

పర్వతాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారకరామారావు  1982లో పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రజల మన్ననలు పొందారని నాయకులు గుర్తుచేశారు. ముఖ్యంగా రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదల పక్షాన నిలిచిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, నాగేశ్వరావు, నాగరాజు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, పలగాని నారాయణ, శ్రీనివాసరావు, శివ, రామ్ మిద్దె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.