పర్వతాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
పర్వతాపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో నందమూరి తారకరామారావు 1982లో పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ప్రజల మన్ననలు పొందారని నాయకులు గుర్తుచేశారు. ముఖ్యంగా రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదల పక్షాన నిలిచిన నాయకుడిగా ఆయనను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, నాగేశ్వరావు, నాగరాజు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు, క్లస్టర్-1 ఇంచార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, పలగాని నారాయణ, శ్రీనివాసరావు, శివ, రామ్ మిద్దె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.