www.ntodaynews.com
పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్తో రెండు పాడి గేదెల మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా రెండు పాడి గేదెలు మృతి చెందాయి.
స్థానికుల వివరాల ప్రకారం, గ్రామంలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన త్రిఫేజ్ వైర్లు తెగి నేలపై పడిపోయాయి. వాటిని సకాలంలో తొలగించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రైతులు సొప్పరపు నరసింహారావు, ఆముదాల వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పాడి గేదెలు ఆ వైర్లకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.
మృతిచెందిన గేదెల విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్లు వదిలివేయడం వల్లే ఈ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణ నష్టపరిహారం అందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.