BREAKING
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి గిరిజన హక్కుల సాధనకై సెప్టెంబర్ 6న చలో ఢిల్లీ సమ్మర్ వాటర్ ట్యాంక్ స్థలం టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై వైసీపీ అభ్యంతరం ఏటికొప్పాకకు పర్యాటక హంగులు సూరారంలో పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమం
www.ntodaynews.com

పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 01:23 PM
202 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా రెండు పాడి గేదెలు మృతి చెందాయి.

స్థానికుల వివరాల ప్రకారం, గ్రామంలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన త్రిఫేజ్ వైర్లు తెగి నేలపై పడిపోయాయి. వాటిని సకాలంలో తొలగించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రైతులు సొప్పరపు నరసింహారావు, ఆముదాల వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పాడి గేదెలు ఆ వైర్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.

మృతిచెందిన గేదెల విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్లు వదిలివేయడం వల్లే ఈ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణ నష్టపరిహారం అందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.