BREAKING
కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ కాలనీల గుర్తింపుతోనే అభివృద్ధి సాధ్యం ​రాజక్కపల్లిలో ‘శివాజీ నగర్ కాలనీ’ బోర్డు ఆవిష్కరణ ఆగిరిపల్లిలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరిక పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు ​లక్షెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ​కాంగ్రెస్ పార్టీ పదవుల్లో పద్మశాలీయులకు తీవ్ర అన్యాయం ​ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ పెనుగొలనులో ఘనంగా మహారాణి అహల్యబాయి హోల్కర్ జయంతి వేడుకలు పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి ​ఇంటిపై ‘సోలార్‌’.. లక్ష రూపాయల సబ్సిడీ
www.ntodaynews.com

పర్వతాపురంలో విషాదం.. కరెంట్ షాక్‌తో రెండు పాడి గేదెల మృతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 01:23 PM
9 వీక్షణలు

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కారణంగా రెండు పాడి గేదెలు మృతి చెందాయి.

స్థానికుల వివరాల ప్రకారం, గ్రామంలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు సంబంధించిన త్రిఫేజ్ వైర్లు తెగి నేలపై పడిపోయాయి. వాటిని సకాలంలో తొలగించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రైతులు సొప్పరపు నరసింహారావు, ఆముదాల వెంకటేశ్వరరావుకు చెందిన రెండు పాడి గేదెలు ఆ వైర్లకు తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.

మృతిచెందిన గేదెల విలువ రూ. లక్షకు పైగా ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. నిర్లక్ష్యంగా విద్యుత్ వైర్లు వదిలివేయడం వల్లే ఈ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణ నష్టపరిహారం అందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.