పర్వతపురంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతపురం గ్రామంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు కళ్లేపల్లి మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కళ్లేపల్లి వసంతరావు, గోలి విష్ణు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు భూబత్తుల చెన్నారావు, మిద్దె సత్యనారాయణ, బొర్రా నాగేశ్వరావు, ఉయ్యాల దిలీప్ కుమార్ కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని యువత పెద్ద ఎత్తున పాల్గొని కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ‘జై జనసేన’ నినాదాలతో పర్వతపురం గ్రామం మార్మోగింది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చీపు మల్లేశ్వరావు, బయగాని మల్లికార్జునరావు, మిద్దె మురళి, బజ్జురి అనిల్, సత్యనారాయణ, చొప్పరపు నాగేశ్వరావు, లక్ష్మయ్యతో పాటు గ్రామస్తులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.