పర్వతపురంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేశారు. అలాగే గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి నాగేశ్వరావు, చాట్రాయి టీడీపీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి భూబత్తుల చెన్నారావు, సీనియర్ నాయకుడు మిద్దె సత్యనారాయణ, క్లస్టర్-1 ఇన్చార్జి ఉయ్యాల దిలీప్ కుమార్, చీపు మల్లేశ్వరావు, మిద్దె మురళి మహేశ్వరావు, బయగాని మల్లికార్జునరావు, యూనిట్ ఇన్చార్జి బొర్రా నాగరాజు, కార్యదర్శి చొప్పరపు నాగేశ్వరావు, బీజేపీ నాయకుడు మేకపోతుల వెంకటేశ్వరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.