BREAKING
ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంఘం నాయకులు అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత కలెక్టరేట్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్! APSPDCL లో నకిలీ సర్టిఫికెటలతో ఉద్యోగాలు 69 మంది ఔట్ ఆపదలో ప్రాణ దాతగా 108 సేవలు అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం చెత్తనుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు శ్రీశైలం - సాంసృతిక కార్యక్రమాలు ఎన్.ఆర్. అశోక్‌ను పరామర్శించిన దళితుల సంఘం నాయకులు అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత కలెక్టరేట్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్! APSPDCL లో నకిలీ సర్టిఫికెటలతో ఉద్యోగాలు 69 మంది ఔట్ ఆపదలో ప్రాణ దాతగా 108 సేవలు అమరావతి చట్టభద్దతపై పార్లమెంట్ ఆమోదం - చంద్రబాబు హర్షం రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రారంభం చెత్తనుంచి విజ్ఞాన వెలుగులు పంచిన స్వచ్ఛ రథాలు శ్రీశైలం - సాంసృతిక కార్యక్రమాలు
www.ntodaynews.com

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:37 PM
36 వీక్షణలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ… అమెరికా భారీ బలగాల మోహరింపు 

పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను వేగంగా పెంచుతోంది. ఈ క్రమంలో అత్యాధునిక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలి ఆ ప్రాంతానికి చేరుకుంది.

ఈ యుద్ధనౌకలో సుమారు 2,500 మంది మెరైన్‌ సైనికులు ఉండగా, వీరి రాకతో ఆ ప్రాంతంలో అమెరికా అదనంగా మోహరించిన బలగాల సంఖ్య 3,500 దాటింది. ఈ విషయాన్ని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ అధికారికంగా వెల్లడించింది.

యూఎస్‌ఎస్‌ ట్రిపోలి అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందించబడిన నౌక. దీనిపై ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు సహా పలు యుద్ధ విమానాలను మోహరించే సామర్థ్యం ఉంది. అవసరమైతే వేగంగా దాడులు జరిపేలా, అలాగే వ్యూహాత్మకంగా బలగాలను తరలించేలా ఇది ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఈ పరిణామం పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళనను పెంచుతోంది. ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.