BREAKING
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
Date of Publish : 17 March 2026, 01:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 01:07 PM
277 వీక్షణలు

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు 

చాట్రాయి, మార్చి 17: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.

మంగళవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎల్‌ఏఎస్‌ఏ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చన్నారు.

అలాగే దూడల్లో మరణాలను నివారించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా గాలికుంటు టీకా వేయించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గ్రామ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగుండ్ల రమేష్, మోదుగు ముత్తయ్య, ఎల్‌ఎస్‌ఏ పవనకుమారి, గోపాలమిత్ర వెంకటేశ్వరరావు, ఏహెచ్‌ఏ హరికృష్ణ తదితరులు, రైతులు పాల్గొన్నారు.