పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు
పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు
చాట్రాయి, మార్చి 17: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.
మంగళవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎల్ఏఎస్ఏ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చన్నారు.
అలాగే దూడల్లో మరణాలను నివారించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా గాలికుంటు టీకా వేయించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గ్రామ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగుండ్ల రమేష్, మోదుగు ముత్తయ్య, ఎల్ఎస్ఏ పవనకుమారి, గోపాలమిత్ర వెంకటేశ్వరరావు, ఏహెచ్ఏ హరికృష్ణ తదితరులు, రైతులు పాల్గొన్నారు.