BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 01:07 PM
153 వీక్షణలు

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు 

చాట్రాయి, మార్చి 17: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.

మంగళవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎల్‌ఏఎస్‌ఏ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చన్నారు.

అలాగే దూడల్లో మరణాలను నివారించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా గాలికుంటు టీకా వేయించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గ్రామ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగుండ్ల రమేష్, మోదుగు ముత్తయ్య, ఎల్‌ఎస్‌ఏ పవనకుమారి, గోపాలమిత్ర వెంకటేశ్వరరావు, ఏహెచ్‌ఏ హరికృష్ణ తదితరులు, రైతులు పాల్గొన్నారు.