BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 01:07 PM
237 వీక్షణలు

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు 

చాట్రాయి, మార్చి 17: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.

మంగళవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎల్‌ఏఎస్‌ఏ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చన్నారు.

అలాగే దూడల్లో మరణాలను నివారించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా గాలికుంటు టీకా వేయించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గ్రామ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగుండ్ల రమేష్, మోదుగు ముత్తయ్య, ఎల్‌ఎస్‌ఏ పవనకుమారి, గోపాలమిత్ర వెంకటేశ్వరరావు, ఏహెచ్‌ఏ హరికృష్ణ తదితరులు, రైతులు పాల్గొన్నారు.