BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
11 May, 2026 - 05:53 PM
252 వీక్షణలు

NTODAY NEWS నల్గొండ జిల్లా 

బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం కేతేపల్లి మండలం  కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ తీరును స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ​​జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కంటైనర్ లారీలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, 24 గంటల పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పశువులను తరలించే వాహనాలకు తప్పనిసరిగా రవాణా పత్రాలు, వెటర్నరీ వైద్యుల సర్టిఫికెట్లు ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడినా, జంతు క్రూరత్వానికి ఒడిగట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్-100కు కాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా ​సోషల్ మీడియాపై నిఘా

​పండుగ పూట మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ​ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతపల్లి ఎస్సై సతీష్, శాలిగౌరారం ఎస్సై సైదులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.