Road Issue: పుంగనూరులో రోడ్ల సమస్యపై ఆందోళన.. బుధవారంలోగా పనులు పూర్తి చేయాలని హెచ్చరిక
అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా పుంగనూరులో రోడ్ల సమస్యపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెల రోజులుగా రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను కోరుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల కథనం ప్రకారం, కొంత మేర మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టి మిగతా రహదారులను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని సమాధానం చెబుతున్నారని తెలిపారు.
అయితే బుధవారంలోగా మిగిలిన రోడ్ల పనులు పూర్తి చేయకపోతే నిరాహార దీక్షకు దిగుతానని సంబంధిత వ్యక్తి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణమే స్పందించి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.