BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

పుంగనూరు INTACH చాప్టర్ కన్వీనర్ -కో కన్వీనర్ ల నియామకం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Jun, 2026 - 11:09 PM
11 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి వారసత్వ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న INTACH (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) (భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ) సంస్థ, పుంగనూరు చాప్టర్ కి సరుం మహీపాల్ రెడ్డి గారిని కన్వీనర్, చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి ని కో-కన్వీనర్ నియమించింది.ఈ మేరకు INTACH కేంద్ర కార్యాలయం,న్యూఢిల్లీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా నూతన కన్వీనర్ సరుం మహీపాల్ రెడ్డి మాట్లాడుతూ,తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు,చెరువులు,శిలాశాసనాలు, సాంప్రదాయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కో-కన్వీనర్ చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కన్వీనర్తో కలిసి వారసత్వ పరిరక్షణ, విద్యార్థుల్లో అవగాహన, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ నియామక ప్రక్రియలో విశేష సహకారం అందించిన కె. చిన్నపరెడ్డి, INTACH కడప చాప్టర్ కన్వీనర్ మరియు INTACH గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు & ఓ. వెంకటేశ్వర రెడ్డి (INTACH కడప సభ్యులు) మరియు ఈ నియామక ప్రక్రియలో డా. శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డి,సుధాకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి తదితరులు సభ్యులుగా అందించిన సహకారం విశేషమైనది. వీరికి నూతన నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.పుంగనూరు చాప్టర్ ద్వారా హెరిటేజ్ వాక్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు,చారిత్రక కట్టడాల డాక్యుమెంటేషన్, సంప్రదాయ కళల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రజలు, విద్యార్థులు,చరిత్రాభిమానులు, స్వచ్చంద సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు INTACH కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.