పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...
పుంగనూరు లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు, ఆగస్టు 5: అన్నమయ్య జిల్లా పుంగనూరు సమీపంలోని రాంపల్లి( శాంతినగర్) వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈడిగిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (37), తండ్రి సుబ్బారం, వ్యక్తిగత పనుల నిమిత్తం కొడుకు తో కలిసి ద్విచక్ర వాహనంపై పుంగనూరుకు వస్తుండగా రాంపల్లి సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందింది.
ప్రమాదంలో గాయపడిన మహిళ మీన (35), భర్త భాస్కర్, పుంగనూరు శాంతినగర్కు చెందినది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఇద్దరినీ పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
తీవ్ర గాయాలపాలైన మీనకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఉన్నత వైద్యశాలకు రిఫర్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.