పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం..
పుంగనూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా హఠాన్మరణం..
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ హాజీ పి. వాహీదున్నిసా శుక్రవారం, ఉదయం మృతి చెందారు.ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.ఆమె 1995 నుండి 2000 సంవత్సరం వరకు పుంగనూరు మున్సిపల్ చైర్పర్సన్గా సేవలందించారు.ఆమె పదవీకాలంలో పుంగనూరు పట్టణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.నిగర్విగా,ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న హాజీ పి. వాహీదున్నిసా వారి మరణం పుంగనూరు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆమె హఠాన్మరణం పట్ల స్థానిక రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు పుంగనూరు మున్సిపల్ సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.