BREAKING
శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
www.ntodaynews.com

పుంగనూరు ప్రధాన రహదారి మరమ్మతుల కోసం దీక్ష – ప్రతి ఒక్కరూ తరలిరావాలని CPI పార్టీ పిలుపు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jul, 2026 - 07:43 AM
9 వీక్షణలు

పుంగనూరు | NTODAY NEWS

అన్నమయ్య జిల్లా పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రధాన రహదారి అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు అనేది ప్రతి ఒక్కరి కనీస అవసరమని, దాని దుస్థితి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు.

ఈ రహదారిపై గతంలో జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ, ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు, భక్తులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

గత నెల రోజులుగా రోడ్డు మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ (R&B) అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, నామమాత్రపు పనులతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు.

బుధవారం లోగా రోడ్డు పనులను పునఃప్రారంభించి మరమ్మతులు చేపట్టకపోతే భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.