BREAKING
13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి 13వ రోజు దివాకరన్న పెరుగన్నం పంపిణీ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
www.ntodaynews.com

పుంగనూరు పోలీసుల హెచ్చరిక- ఇతర రాష్ట్రాల కార్మికుల నమోదు తప్పనిసరి.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 May, 2026 - 09:04 AM
11 వీక్షణలు

ఇతర రాష్ట్రాల కార్మికుల నమోదు తప్పనిసరి – పుంగనూరు పోలీసుల హెచ్చరిక

పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, హోటల్ యజమానులు, లాడ్జ్ యజమానులు, గృహ యజమానులు, వ్యాపార సంస్థల నిర్వాహకులు, ఇటుక బట్టీల యజమానులు, గోదాముల నిర్వాహకులు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులను పనిలో ఉంచుకున్న వారందరికీ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు.

పుంగనూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాలకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చి భవన నిర్మాణ పనులు, హోటల్ సేవలు, డ్రైవర్లు, గృహ సేవకులు, వాచ్‌మెన్లు, పరిశ్రమలు, గ్రానైట్ క్వారీలలో మరియు ఇతర వృత్తుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో, వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించడం ప్రతి యజమాని మరియు కాంట్రాక్టర్ యొక్క చట్టబద్ధమైన బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ మేరకు, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను పనిలో ఉంచుకున్న వారు రెండు నుంచి మూడు రోజులలోపు ఆయా కార్మికులను పుంగనూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి హాజరు పరచాలని సూచించారు. కార్మికుల పూర్తి పేరు, తండ్రి పేరు, స్వస్థల చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, గతంలో పనిచేసిన ప్రదేశం, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశం, యజమాని మరియు కాంట్రాక్టర్ వివరాలు, ఫోటోలు తదితర సమాచారాన్ని పోలీసు శాఖ నిర్దేశించిన ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కార్మికుల ముసుగులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ కోసం ఈ నమోదు ప్రక్రియను తప్పనిసరి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు నిర్వహించే తనిఖీల సమయంలో ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు పోలీస్ రికార్డుల్లో లేకపోతే, సంబంధిత యజమానులు, కాంట్రాక్టర్లు లేదా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కావున పుంగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా యజమానులు మరియు కాంట్రాక్టర్లు, వెంటనే పోలీసు శాఖకు సహకరించి అవసరమైన వివరాలు సమర్పించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

“ప్రజల సహకారమే పోలీస్ శాఖకు బలం” అని పుంగనూరు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.