BREAKING
పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి పేద వాడి భూమి.. ఐతే 1బి పేరు మార్పు చేసిన రెవిన్యూ అధికారులు. అమరావతిలో సీఎం 7వ ఉన్నతస్థాయి సదస్సు.. పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.. గణనీయంగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర హజరత్ సయ్యద్ నూర్ షావలి ఉరుసులో పాల్గొననున్న చల్లా ​వెంకటగిరి IIHTలో డిప్లొమా ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రిథమ్ డాన్స్ కాంపిటీషన్ కార్యక్రమం ఆడబిడ్డ పెళ్లికి కుటుంబానికి ఆర్థిక చేయూత బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మైనర్ గ్యాంగ్ అరెస్ట్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
www.ntodaynews.com

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
18 May, 2025 - 08:24 AM
77 వీక్షణలు
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 ఏలూరు, మే, 18 : రానున్న మూడు రోజులపాటు కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవిన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. . ప్రతి మండలం ప్రధాన కేంద్రంలో, డివిజన్ ప్రధాన కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది 24x7 అందుబాటులో ఉండాలని తెలిపారు, పకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. Follow us on Website Facebook Instagram YouTube