BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి

తెలంగాణ
17 May, 2025 - 07:59 AM
206 వీక్షణలు
స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి ఏలూరును స్వచ్ఛ నగరంగా తయారుచేయడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు 42వ డివిజన్ కొత్తపేటలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతపై నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం బీట్ ద హీట్ పేరుతో వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుదల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మొక్కలు నాటి, స్వచ్ఛతపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా బీట్ ద హీట్ కార్యక్రమం, స్వచ్ఛతపై కమిషనర్ ఎ.భానుప్రతాప్ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. గతంలో తాను ఇచ్చిన మాటకు కట్టుబడి శానిటేషన్ నిర్వహణలో ఇతరులకు ఆదర్శప్రాయంగా విధులు నిర్వర్తించిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఏలూరు నగరాభివృద్ది సాధ్యమవుతుందన్నారు. ప్రతినెలా మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని,, ఈ నేపథ్యంలో ఈ శనివారం బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు నగరంలోని పలుచోట్ల దాతల సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. అలాగే నగర ప్రజలు స్వచ్ఛతపై బాధ్యతగా వ్యవహరించాలని,, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డివిజన్ ఇంచార్జ్ త్రిపర్ణ శ్రీదేవి, క్లస్టర్ ఇంచార్జ్ మల్లెపు రాము, కో క్లస్టర్ త్రిపర్ణ రాజేష్,అర్నేపల్లి మధు,కార్పొరేటర్ అర్జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube