BREAKING
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం
www.ntodaynews.com

ఫైర్ మెన్ నూతి కాశీరామ్‌కు ఉత్తమ సేవ ప్రతిభా పురస్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Aug, 2026 - 09:17 PM
167 వీక్షణలు

ఫైర్ మెన్ నూతి కాశీరామ్‌కు ‘ఉత్తమ సేవ’ ప్రతిభా పురస్కారం

18 ఏళ్ల విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు  పురస్కారాన్ని అందజేసిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి


నిరంతరం ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడంలో శ్రమిస్తూ, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది నూతి కాశీరామ్‌ను ‘ఉత్తమ సేవ’ ప్రతిభా పురస్కారం వరించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను అగ్నిమాపక శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. స్వాతంత్ర వేడుకలు భాగంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు సమక్షంలో యాదాద్రి భువనగిరి ​జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా కాశీరామ్ ఈ ప్రతిభా పురస్కారాన్ని ఘనంగా అందుకున్నారు. ​​గత 18 సంవత్సరాలుగా అగ్నిమాపక శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న కాశీరామ్, అనేక ప్రమాద సమయాల్లో ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. అత్యవసర వేళల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడంలో ఆయన చూపిన చొరవను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవలో 18 ఏళ్లుగా కొనసాగడం, ఈ సందర్భంగా కాశీరాం మాట్లాడుతూ శాఖ గుర్తించి ఇలాంటి పురస్కారంతో గౌరవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పురస్కారం నాపై బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ​ఈ సందర్భంగా కాశీరామ్‌కు రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.