www.ntodaynews.com
టిట్కో ఇండ్లలో పోలీసుల అవగాహన కార్యక్రమం
తెలంగాణ
టిట్కో ఇండ్లలో పోలీసుల అవగాహన కార్యక్రమం
అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
పుంగనూరు పట్టణ పరిధిలోని గూడూరుపల్లి జగనన్న కాలనీ టిట్కో ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్సైలు రమణ, అన్సర్ భాష పాల్గొని, కాలనీల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సైలు మాట్లాడుతూ, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలపై ఫిర్యాదు చేస్తే, సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఉమెన్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.ఏ. సల్మా, డివిజన్ ప్రెసిడెంట్ హన్సర్, యూత్ వింగ్ ప్రెసిడెంట్ జాఫర్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#PoliceAwareness
#CommunityPolicing
#TIDCOHouses
#Punganur
#PublicSafety
#CrimePrevention
#NtodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube