షెడ్డు నిర్మాణం అడ్డుకున్న పోలీసులు.. BJP ఆగ్రహం
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
మేడిపల్లి / N Today News:
మేడిపల్లి CPRI సమీపంలోని శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో BJP నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న సేజ్ స్కూల్ యాజమానికి అధికారులు వత్తాసు పలుకుతూ, ఆలయ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బండారు పవన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నిరసనకు పిలుపునిచ్చారు.