www.ntodaynews.com
ప్రజల వద్దకు ప్రవీణ్
తెలంగాణ
ప్రజల వద్దకు ప్రవీణ్: 100 రోజులు – 100 గ్రామాలు
NTODAY NEWS:అమరావతి 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో కార్యక్రమం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు, 100 గ్రామాలు పర్యటన కార్యక్రమం 31వ రోజు క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత ఆన్లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ఈ పర్యటన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచేటి సాయి, ఎమ్మార్వో, ఎండిఓ, మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube