విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్
సోమవారం స్థానిక మాధురి జూనియర్ కాలేజ్ భీమడోలు నందు 07- 12- 2025 జరిగిన APEX INTELLIGENT TEST 10 వ తరగతి విద్యార్థులకు సుమారు చుట్టుపక్కల 12 స్కూల్ నుండి 300 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అందులో విజేతలకు బహుమతులు ప్రధాన కార్యక్రమం జరిగింది విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో టాలెంట్ టెస్ట్ కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి జడ్జి మేడం విచ్చేసి, విద్యార్థులకు బహుమతులు అందించారు విజేతలకు జడ్జి మేడం చేతుల మీదుగా బహుమతులు మరియు సర్టిఫికేట్లు అందజేయడం జరిగింది.
1st prize : 5000/-,
2nd prize : 3000/-
3rd prize : 2000/-
వీటితో పాటు మెమొంటో మరియు సర్టిఫికెట్ అందించడం జరిగింది...
1st prize: వెజ్జు. నిఖిత దేవి (
మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ )
సెకండ్ ప్రైజ్ ఒకే మార్కులతో ఇద్దరికి రావడం జరిగింది....
1) కరణం శ్రీ హర్షిత (
భీమడోలు హై స్కూల్ )
2) జల్లా తరుణి (
డిపాల్ హైస్కూల్ )
3rd prize ఒకే మార్కులతో ముగ్గురికి రావడం జరిగినది
1) బలే అంజలి (
గుండుగోలను హై స్కూల్ )
2) చిక్కాల . స్వరూప (
భీమడోలు హై స్కూల్ )
3) కొండేటి. యశ్వంత్ (
పూళ్ళ హై స్కూల్ )
ఈ సందర్భంగా జడ్జి మేడం మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలతోనే కాకుండా, తమ ప్రతిభను కూడా అభివృద్ధి చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జ్ మేడం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు ....
ఈ కార్యక్రమంలో కె . గీతాంజలి ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు , కె గంగరాజు ప్యానల్ అసోసియేషన్ మెంబర్ భీమడోలు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ , భీమడోలు హై స్కూల్ హెచ్ఎం పద్మజ గారు, మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ రవీంద్ర , గుండుగోలను హై స్కూల్ హెచ్ఎం సునీత , డిపాల్ ప్రిన్సిపాల్ టోనీ , హై స్కూల్ మాస్టర్ అహ్మద్ , కళాశాల కస్పాండెంట్ ప్రేమ్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు తల్లిదండ్రులు ,విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు....
Follow us on
Website
Facebook
Instagram
YouTube