www.ntodaynews.com
ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు
తెలంగాణ
ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు
శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: వెల్గటూర్
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు మంత్రి నగదు బహుమతులు అందజేసి అభినందించారు. గ్రామీణ క్రీడలు, సంప్రదాయాలను పరిరక్షించడంలో ఇలాంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మంత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ భాపెల్లి రాజయ్య, గ్రామస్తులు, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మెరుగు మురళి, గండ్ర శ్రీకాంత్ రావు, మెరుగు నరేష్, వెల్గటూర్ ఉపసర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#BullockCartRace
#TempleFestival
#RuralSports
#Velgatoor
#TelanganaNews
#VillageTraditions
#CulturalHeritage
Follow us on
Website
Facebook
Instagram
YouTube