www.ntodaynews.com
పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం
తెలంగాణ
పాషిగామ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నిర్వీర్యం
పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం
NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
అధికారుల నిర్లక్ష్యంపై యువత ఆగ్రహం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామ పంచాయతీకి పారిశుధ్య పనుల కోసం అందించిన ట్రాక్టర్ ప్రస్తుతం నిర్వీర్యంగా మారి, పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టి పాత ఇనుప సామానులా పడివున్న దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా ధనంతో అందించిన ఈ ట్రాక్టర్ను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేయడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్త సమస్యలు, పారిశుధ్య లోపాలు ఉన్నప్పటికీ ట్రాక్టర్ను పనులకు వినియోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు అన్నారు.
ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వెల్గటూర్ మండల సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడు ఉపారపు సతీష్ మాట్లాడుతూ,
“గ్రామాభివృద్ధికి ఉపయోగించాల్సిన వాహనం ఇలా తుక్కు సామానులా మారడం బాధాకరమని. ఇది ప్రజాధనం వృథా అవుతున్న దానికి స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికైనా నూతన గ్రామ పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాక్టర్ను మరమ్మతులు చేసి గ్రామ పంచాయతీ పనులకు వినియోగించాలి” అని డిమాండ్ చేశారు.
గ్రామాభివృద్ధికి ఇచ్చిన వాహనం నిర్లక్ష్యానికి గురికావడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
#PublicMoney
#VillageDevelopment
#PanchayatIssues
#Negligence
#SanitationWorks
#RuralInfrastructure
#JagtialDistrict
#TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube