BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 29 January 2026, 08:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం

తెలంగాణ
29 Jan, 2026 - 08:01 AM
197 వీక్షణలు
పాషిగామ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నిర్వీర్యం పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ అధికారుల నిర్లక్ష్యంపై యువత ఆగ్రహం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామ పంచాయతీకి పారిశుధ్య పనుల కోసం అందించిన ట్రాక్టర్ ప్రస్తుతం నిర్వీర్యంగా మారి, పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టి పాత ఇనుప సామానులా పడివున్న దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా ధనంతో అందించిన ఈ ట్రాక్టర్‌ను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేయడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్త సమస్యలు, పారిశుధ్య లోపాలు ఉన్నప్పటికీ ట్రాక్టర్‌ను పనులకు వినియోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు అన్నారు. ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వెల్గటూర్ మండల సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడు ఉపారపు సతీష్ మాట్లాడుతూ, “గ్రామాభివృద్ధికి ఉపయోగించాల్సిన వాహనం ఇలా తుక్కు సామానులా మారడం బాధాకరమని. ఇది ప్రజాధనం వృథా అవుతున్న దానికి స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికైనా నూతన గ్రామ పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాక్టర్‌ను మరమ్మతులు చేసి గ్రామ పంచాయతీ పనులకు వినియోగించాలి” అని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధికి ఇచ్చిన వాహనం నిర్లక్ష్యానికి గురికావడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #PublicMoney #VillageDevelopment #PanchayatIssues #Negligence #SanitationWorks #RuralInfrastructure #JagtialDistrict #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube