www.ntodaynews.com
రాఘవాపురంలో కుప్పిరెడ్డి ప్రసాద్ రెడ్డిని పరామర్శించిన జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
రాఘవాపురంలో కుప్పిరెడ్డి ప్రసాద్ రెడ్డిని పరామర్శించిన జోగి రమేష్
రాఘవాపురం/రెడ్డిగూడెం మండలం, జూలై 19: రెడ్డిగూడెం మండల ఎంపీటీసీ, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కుప్పిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇటీవల కాలు ఇన్ఫెక్షన్కు చికిత్స పొంది కోలుకున్న నేపథ్యంలో, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్ ఆదివారం సాయంత్రం రాఘవాపురంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.