Jana Sena: రాజంపేటలో జనసేన కమిటీల నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ.. జనసైనికులకు పిలుపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు | NTODAY NEWS
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి కమిటీ నుంచి పార్లమెంట్ స్థాయి కమిటీల వరకు వివిధ హోదాలకు జనసేన పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
పుంగనూరు నియోజకవర్గంలోని జనసైనికులు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకత్వం కోరింది.
ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జూన్ 29 నుంచి ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి (POC) సీవీ గంగాధర్ (చిన్న రాయల్), రాజంపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) సంయుక్తంగా జనసైనికులకు విజ్ఞప్తి చేశారు.