BREAKING
భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ దుర్గాదేవి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం
www.ntodaynews.com

రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:14 PM
38 వీక్షణలు

రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని రాజవరం గ్రామంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచి అబ్బూరి వెంకటయ్య మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ప్రత్యేక జాతీయ పతాకం అవసరమనే సంకల్పంతో 1916లో "భారతదేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని వివరించారు.

గాంధీ సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తు ఉన్న జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారని, 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఆ పతాకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి ప్రస్తుత జాతీయ పతాకాన్ని అమల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

విశ్వహిందూ పరిషత్ జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకర్త మాత్రమే కాకుండా పురాతన నాణేలు, భూగర్భ శాస్త్రం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేసి పుస్తకాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.

మాజీ సర్పంచి చెన్నుపాటి నరసింహారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి వెంకయ్య తెలుగు వ్యక్తి కావడం ప్రతి తెలుగువారికి గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన్నే నరసింహమూర్తి, బండారుపల్లి వెంకట నరసయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల యుగంధర్, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు పారేపల్లి కృష్ణారావు, వై. జగన్నాథం, తొండపు శ్రీను, సుగ్గల ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెనుగొలనులో వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా యూత్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ అధ్యక్షతన పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం, మూడు రంగుల విశిష్టతను వివరించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేసి జాతీయ పతాకానికి గౌరవం కాపాడాలని పిలుపునిచ్చారు.