రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా స్కూల్ పిల్లలకి నోట్ బుక్స్, స్టేటనరీ పంపిణీ
అన్నమయ్య జిల్లా పుంగనూరు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, గూడూరుపల్లి లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 130 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ మొదలగు స్టేషనరీ ను రామచంద్ర యాదవ్ అభిమానులు రాము యాదవ్, చలపతి ఆధ్వర్యంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు సమక్షంలో పిల్లలకు బుక్స్ స్టేటనరీ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము యాదవ్ , చలపతి మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు రామచంద్ర యాదవ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలనునిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్ లో మరెన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో చలపతి రాము యాదవ్ ముని యాదవ్ నాని దామోదర్ నవీన్ కృష్ణా రెడ్డి నాగరాజ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.