BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

రామన్నపేట టు కీసర.. కల్తీ అల్లం పేస్ట్ భారీ దందా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
26 Jul, 2026 - 12:54 PM
398 వీక్షణలు

రామన్నపేట టు కీసర.. కల్తీ అల్లం పేస్ట్ భారీ దందా 

  •  కీసర తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి!

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న కల్తీ రాయుళ్ల ఆటకట్టించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు విరుచుకుపడ్డారు. రామన్నపేట కేంద్రంగా సాగుతున్న భారీ కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టును బయట పెట్టీ  తయారీ కేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్  ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ  మధుసూదన్ రెడ్డి  ప్రత్యక్ష పర్యవేక్షణలో రామన్నపేట పోలీసులు రంగంలోకి దిగారు. రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్  ఎం. రవి, ఎస్సై జి. సతీష్ తమ సిబ్బందితో కలిసి రామన్నపేట సెంటర్‌లో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ​ఈ తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్‌ను నిలిపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేని, ప్యాకింగ్ నిబంధనలు పాటించని భారీ ఎత్తున అల్లం పేస్ట్ డబ్బాలు లభ్యమయ్యాయి. వాహన డ్రైవర్‌ను తమదైన శైలిలో పోలీసులు విచారించగా ఈ కల్తీ పేస్ట్ మూలాలు మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలోని ఒక సీక్రెట్ తయారీ యూనిట్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. ​డ్రైవర్ ఇచ్చిన పక్కా సమాచారంతో తక్షణమే స్పందించిన రామన్నపేట పోలీసులు, ఫుడ్ సేఫ్టీ  అధికారులతో కలిసి కీసరలోని సంబంధిత ప్రాంగణంపై సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. పరిశ పరిశీలనలో అక్కడ ప్రమాదకర రసాయనాలు, కుళ్ళిన అల్లం, నిషిద్ధ పదార్థాలతో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తేలింది. ​ఘటనా స్థలంలో ఉన్న కల్తీ ముడి పదార్థాలు, కల్తీకి ఉపయోగిస్తున్న యంత్రాలు, విక్రయానికి సిద్ధంగా ఉన్న టన్నుల కొద్దీ ఫినిష్డ్ ప్రొడక్ట్ డబ్బాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు అని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా చేసే వారిపై పి.డి యాక్ట్ సహా కఠినమైన చట్టపరమైన జిల్లా పోలీసులు హెచ్చరించారు ​ఈ అక్రమ వ్యవహారంపై సంబంధిత ఆహార భద్రత చట్టాలు, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు ? ఎవరెవరికి ఈ కల్తీ పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారు ? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.


​సమయానుకూలంగా స్పందించి భారీ కల్తీ దందాను అరికట్టిన రామన్నపేట సీఐ, ఎస్సై, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని స్థానిక ప్రజలు, వినియోగదారుల సంఘాలు అభినందించాయి...