రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, మంచిర్యాల తహసిల్దార్ రహతుల్లా లతో కలిసి ఆయన ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేడుకలను విజయవంతం చేయడానికి అన్ని ముందస్తు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు మరియు ఇతర కనీస వసతులను పక్కాగా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు