BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రాష్ట్రంలో ఎండల తీవ్రత... 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Apr, 2026 - 03:16 PM
118 వీక్షణలు

వాతావరణ శాఖ హెచ్చరికలు... వడగాడ్పులు, వర్షాలు...

పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీలు

అమరావతి, విశాఖపట్నం: రాష్ట్రంలో వేసవి తీవ్రత మరింత పెరిగింది. శనివారం 200 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదయ్యాయి.

వాతావరణ శాఖ తెలిపిన మేరకు, శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని సూచన ఇచ్చింది.

అదే విధంగా, ఆదివారం కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రజలు ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అధిక ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవడం అత్యంత అవసరం.

తీవ్ర వడగాడ్పుల హెచ్చరికలు

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 35 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి...

ఈ వేడి గాలులు మరియు వర్షాలతో ముందస్తుగా సన్నద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.