రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్కు తిరువూరు విద్యార్థినులు
రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్కు తిరువూరు విద్యార్థినులు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యారు. నందిగామలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎం. మయూరి వాలీబాల్ విభాగంలో, మొదటి బైపీసీ విద్యార్థిని కె. పూజిత ఖోఖో విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తిరువూరుకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల, హైస్కూల్ ప్లస్ ఇన్చార్జి కె. మోహన్రావు ఆకాంక్షించారు.
విద్యార్థినులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు జి. సుకన్య, బి. జయలక్ష్మిని ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థినులు అభినందించారు.