రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్లో తొలిసారి పేరూరు డ్యామ్కు వరద నీరు
రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్లో తొలిసారి పేరూరు డ్యామ్కు వరద నీరు
రాయలసీమలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నదిపై నిర్మించిన పేరూరు డ్యామ్కు ఈ సీజన్లో తొలిసారిగా వరద నీరు చేరింది.
డ్యామ్లోకి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ డ్యామ్ వద్దకు చేరుకుని నీటికి స్వాగతం పలికారు. కొందరు డ్యామ్లోకి దిగి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాలకు పేరూరు డ్యామ్ కీలక నీటి వనరుగా ఉంది. డ్యామ్లోకి నీరు చేరడం వల్ల సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పాటు లభించనుండటంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రాయలసీమలో నీటి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.