BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:58 PM
51 వీక్షణలు

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

రాయలసీమలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నదిపై నిర్మించిన పేరూరు డ్యామ్‌కు ఈ సీజన్‌లో తొలిసారిగా వరద నీరు చేరింది.

డ్యామ్‌లోకి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ డ్యామ్ వద్దకు చేరుకుని నీటికి స్వాగతం పలికారు. కొందరు డ్యామ్‌లోకి దిగి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాలకు పేరూరు డ్యామ్ కీలక నీటి వనరుగా ఉంది. డ్యామ్‌లోకి నీరు చేరడం వల్ల సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పాటు లభించనుండటంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రాయలసీమలో నీటి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.