రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు
రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు
అమరావతి, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో తక్కువ ధరలకు బియ్యం విక్రయాలను ఆదివారం (ఆగస్టు 2) నుంచి ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:
BPT సూపర్ ఫైన్ బియ్యం – మార్కెట్ ధర రూ.62 కాగా, రూ.52కే అందుబాటులో ఉంటుంది.
గ్రేడ్-1 రా రైస్ – మార్కెట్ ధర రూ.58 కాగా, రూ.50కే విక్రయించనున్నారు.
ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో అందించడం, మార్కెట్ ధరల ప్రభావాన్ని తగ్గించడం, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.