BREAKING
సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం.
www.ntodaynews.com

రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:40 AM
9 వీక్షణలు

రేపటి నుంచి ఏపీలో తక్కువ ధరకు బియ్యం విక్రయాలు

అమరావతి, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో తక్కువ ధరలకు బియ్యం విక్రయాలను ఆదివారం (ఆగస్టు 2) నుంచి ప్రారంభించనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని ఒక రోజు వాయిదా వేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:

BPT సూపర్ ఫైన్ బియ్యం – మార్కెట్ ధర రూ.62 కాగా, రూ.52కే అందుబాటులో ఉంటుంది.

గ్రేడ్-1 రా రైస్ – మార్కెట్ ధర రూ.58 కాగా, రూ.50కే విక్రయించనున్నారు.

ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలో అందించడం, మార్కెట్ ధరల ప్రభావాన్ని తగ్గించడం, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.