జిల్లాకు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల రాక: రూ. 81 కోట్ల నిధులు, 400 ఉద్యోగ పత్రాల పంపిణీ
మంచిర్యాల: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్ష కోసం రేపు ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రులు జూపల్లి, వివేక్, సీతక్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అద్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. మంచిర్యాలలో బస చేయనున్న ఉప ముఖ్యమంత్రి, గూడెం గ్రామానికి రూ. 70 కోట్లు, విశ్వనాథ ఆలయానికి రూ. 11 కోట్లు కేటాయించడంతో పాటు 400 మందికి డిపెండెంట్ ఉద్యోగ పత్రాలను పంపిణీ చేయనున్నారు. అలాగే మంత్రి శ్రీధర్ బాబు వేంపల్లి ఐటీ కారిడార్ను పరిశీలించి, కోల్ బెల్టులో సింగరేణి ఉద్యోగ నియామక కార్యాలయం ఏర్పాటుపై చర్చించనుండగా, పద్మావతిలో సింగరేణి బెల్ట్ జోనల్ ఎమ్మెల్యేల సమావేశం, కార్యకర్తల శిక్షణా తరగతులు, కార్పొరేట్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని, ఈ పర్యటన జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావు తెలిపారు