వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై అవగాహన కలిగి ఉండాలి
వైద్య కళాశాల విద్యార్థులకు ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమం
హాజరైన డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య కళాశాల విద్యార్థుల కోసం ఆరోగ్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, గ్రామ మరియు మున్సిపల్ స్థాయిల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సదుపాయాలతో పాటు ఆరోగ్య శాఖ సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ ఎండి రషీద్, కళాశాల సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొని జాతీయ కార్యక్రమాల అమలు తీరుపై విద్యార్థులతో వివరంగా చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులో వైద్య విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ సమగ్ర అవగాహన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు