www.ntodaynews.com
ఖమ్మం వైరా రోడ్డులో కోట్ల విలువైన ఐఫోన్ల చోరీ: పోలీసులు దర్యాప్తు
తెలంగాణ
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని "సోనోవిజన్" ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో గురువారం తెల్లవారుజామున సుమారు రెండు నుంచి మూడు గంటల మధ్య దుండగులు భారీ చోరీని పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 160 ఐఫోన్లు సహా ఇతర ఖరీదైన సెల్ఫోన్లు మాయమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం ₹1 కోటి నుండి ₹2 కోట్లు వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు.
చోరీ స్థలానికి చేరుకున్న ఖమ్మం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసుల బృందాలను ఏర్పాటు చేసి, విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే వైరా రోడ్డులో ఇంతటి ఘన చోరీ చోటుచేసుకోవడంతో స్థానికులలో కలకలం నెలకొన్నది.