BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

తెల్లదేవరపల్లి భూములకు రెడ్ మార్క్ తొలగింపు – కలెక్టర్ లక్ష్మీ షా హామీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 03:46 PM
21 వీక్షణలు

విస్సన్నపేట, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాల 232 ఎకరాల భూములకు రెడ్ మార్క్ తొలగిస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హామీ ఇచ్చారు. ఈ విషయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ పత్రికలకు తెలిపారు.

నర్సాపురంలో జరిగిన గ్రామస్తుల వినతిపత్రం సమర్పణ సందర్భంగా, ఈ భూములు ఎప్పటినుండి 70 ఏళ్ళుగా సాగు చేస్తున్నప్పటికీ, రెడ్ మార్క్ కారణంగా సరిగా హక్కులు పొందడం లో అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు. స్థానిక శాసనసభ్యులు కేశ్రీనివాసరావు ఈ సమస్యను మద్దతుగా ఆంగీకరించారు.

సర్వే ప్రకారం, సర్వే నంబర్లు 280, 281, 282, 284, 285, 286, 287, 288, 289, 290, 291, 292, 293, 295, 300, 303, 304, 305, 311, 331, 333, 334, 335, 341 లోని 231.95 సెంట్ల భూములు సాగుదారులపాలకీ కింద ఉన్నాయి. కొందరికి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు లభించగా, మిగతావారికి లభించకపోవడం వల్ల వివాహ సమయంలో, కుటుంబ అవసరాల కోసం భూమిని ఇచ్చినా హక్కులు పొందలేక, సామాజిక సమస్యలకు గురైయ్యారు.

రైతులు బ్యాంక్ రుణాలు పొందలేకపోయే పరిస్థితి, రైతు భరోసా పొందడం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి హరినాథ్ సూచన మేరకు, విస్సన్నపేట తాసిల్దార్ సాగుతున్న భూముల వివరాలను పరిశీలించి, రెడ్ మార్క్ తొలగించి డిజిటల్ సైన్ పునరుద్ధరించి, పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేయాలని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం తర్వాత గ్రామస్తులకు భూములపై పూర్తి హక్కులు, రైతు భరోసా లభించడం తో పాటు, సామాజిక, ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.