రైతు కార్డు అవగహన మరియు నమోదు కార్యక్రమం నిర్హించడం జరిగింది
బీబీనగర్ మండల్ పరిధి మహాదేవపూర్లో రైతు కార్డు అవగాహన, నమోదు కార్యక్రమం
95 శాతం నమోదు పూర్తి.. మిగతా రైతులు కూడా నమోదు చేసుకోవాలని సూచన
బీబీనగర్ | Ntoday News
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని మహాదేవపూర్ గ్రామంలో రైతు కార్డు (Farmer Card)పై అవగాహన, నమోదు కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఎం. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రైతులకు రైతు కార్డు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు 95 శాతం మంది రైతుల నమోదు పూర్తయినట్లు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. ఇంకా రైతు కార్డు నమోదు చేసుకోని మిగిలిన 5 శాతం మంది రైతులు కూడా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి రైతు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకునేలా వ్యవసాయ శాఖ తరఫున అవసరమైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రైతు కార్డు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు.