BREAKING
వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం.
Date of Publish : 10 September 2026, 07:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో పేదలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 07:50 PM
1 వీక్షణలు

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర పట్టణంలోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మూడు చెక్కులను జవ్వాజి ఆనందరావు లబ్ధిదారులకు అందజేశారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సహకారంతో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో ఈ ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు.

చెక్కులు పొందిన వారిలో సిరిపురం గ్రామానికి చెందిన ఎదురు పద్మావతికి రూ.23,000, ఇల్లూరు గ్రామానికి చెందిన మడి వెంకన్నకు రూ.27,500, ఇల్లూరు గ్రామానికి చెందిన కొండల అర్చనకు రూ.16,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.66,500 విలువైన మూడు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కార్లపూడి అప్పారావు, మధిర మండల నాయకులు అవ్వుల గురుబ్రహ్మం, జల్లేపల్లి ప్రసాద్, బాదా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.