సచివాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు
సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణ సచివాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన నిధుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు ఆరోపించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేసేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటున్న సమయంలో సంబంధిత అధికారులను పట్టుకున్నట్లు తెలిసింది.
ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ వినోద్తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపడుతున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.