BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:41 PM
26 వీక్షణలు

రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం

గంగవరం గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఘటన

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో మహబూబ్ భాషను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

రైతుకు సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు వీఆర్వో రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్రణాళికతో గంగవరం గ్రామ సచివాలయానికి చేరుకున్న అధికారులు, లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను పట్టుకున్నట్లు తెలిసింది.

ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీఆర్వో మహబూబ్ భాషపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు ఉద్యోగులు లంచాలకు పాల్పడుతూ పట్టుబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.