BREAKING
చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ..
www.ntodaynews.com

రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 12:18 PM
41 వీక్షణలు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు 

మంచిర్యాల/హాజీపూర్:

మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హాజీపూర్ మండలం, పెద్దంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ పేరుకుపోయిన ధాన్యపు రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

​ఈ సందర్భంగా విజిత్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు:

​తీరని ఇబ్బందులు: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​అకాల వర్షాల భయం: ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ధాన్యం తడిసిపోకుండా రైతులు సొంతంగా టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసుకుని కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రభుత్వానికి హెచ్చరిక: వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో పెద్దంపేట గ్రామ సర్పంచ్ జాడి వెంకటేష్, పార్టీ నాయకులు మొగిలి శ్రీనివాస్, మాధవరపు జీవన్ రావు, వంశీ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.